Ranbir Kapoor : రాముడుగా రణ్‌బీర్‌ కపూర్‌,సీతగా సాయిపల్లవి – రావణుడి పాత్ర యశ్‌

By manavaradhi.com

Updated on:

Follow Us

మన తెలుగు సినీ నిర్మాత అల్లు అరవింద్‌ బాలీవుడ్‌ ప్రొడ్యూసర్లతో కలిసి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణానికి సంబందించి వార్త ఒకటి ప్రస్తుతం నెట్ లో హాల్ చల్ చేస్తుంది. ప్రముఖ దర్శకుడు నితేశ్‌ తివారీ (Nitesh Tiwari) ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. అల్లు అరవింద్ రామాయణంలో నటించే కాస్టింగ్ వివరాలు కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సాయి పల్లవి, హనుమంతుడి పాత్రలో సన్నీ దేవోల్‌ కనిపించనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎన్నో విశేషాలు సోషల్ మీడియాలో సందడి చేయగా.. తాజాగా మరోసారి ఈ ప్రాజెక్ట్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్‌ జరగనుంది. అయితే ఈ చిత్రం కోసం యూనిట్ శ్రీలంకలో భారీ సెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ షేర్‌ అవుతుంది. అంతేకాదు ఇక దీని వీఎఫ్ఎక్స్‌ ఎఫెక్ట్‌ల కోసం నితేశ్‌ తివారీ టీమ్‌ ఆస్కార్‌ విన్నింగ్‌ కంపెనీ డీఎన్‌ఈజీ (DNEG)తో సంప్రదింపులు జరిపిందట. ఈ చిత్రం కోసం అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని వినియోగించాలని చిత్రబృందం యోచిస్తోందని అందుకే లుక్‌ టెస్ట్‌ కోసం కూడా త్రీడీ టెక్నాలజీని ఉపయోగించారని టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెలలో మూవీ టీమ్‌ అంతా ఈ పనుల కోసం విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ విజువలైజేషన్ ఇప్పటికే పూర్తయింది. రావణుడి పాత్రలో కేజీఎఫ్ తో మాసీవ్ హిట్ కొట్టిన యశ్ ను ఫిక్స్ చేశారట.

ప్రస్తుతం యానిమల్ మూవీ విజయాన్ని ఆస్వాధిస్తున్న రణ్‌బీర్. ఈ చిత్రం ప్రమోషన్ సమయంలో ఓ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే కొంత విరామం తీసుకున్న తర్వాత మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో నటించనున్నట్లు చెప్పారు. దీంతో ఆ ప్రాజెక్ట్‌ రామాయణమేనని ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సాయి పల్లవి ‘తండేల్‌’లో నటిస్తున్నారు. అలాగే యశ్‌ ‘టాక్సిక్‌’ సినిమా చేస్తున్నారు. మరో రెండు నెలల్లో వీరందరు కలసి పనిచేయబోతున్నారు.

Leave a Comment