తమిళ సినిమా ఇండస్ట్రీతో పాటు ఇటు తెలుగులోను మంచి క్రేజ్ ఉన్న హీరో సూర్య. ప్రతి సారీ వెరైటీ కథలు, వైవిధ్య భరితమైన పాత్రలు ఎంచుకుని వాటిలో ఒదిగిపోయే సూర్య, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ను ఘనంగా లాంచ్ చేసిన చిత్ర బృందం, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుతోంది. ఇక తాజాగా ఈ సినిమాలో మరో బ్యూటీ చేరబోతున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది.
బాలీవుడ్లో ‘యానిమల్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రిప్తి డిమ్రి, ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నారని సమాచారం. అయితే ఆమె లీడ్ రోల్లో కాకుండా, సెకండ్ హీరోయిన్గా కనిపించనుందట. ఈ విషయం గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ, ఈ వార్తలు అభిమానుల్లో ఆసక్తి పెంచేశాయి. అంతేకాదు, ఈ సినిమాకు ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే టైటిల్ను ఫిక్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని కూడా టాక్ వినిపిస్తోంది. టైటిల్ సింపుల్గా ఉన్నప్పటికీ, దీని వెనుక పెద్ద ఎమోషనల్ స్టోరీ ఉండబోతుందన్న అంచనాలు ఉన్నాయి.

మైన్ హీరోయిన్గా అందాల భామ మమితా బైజు నటిస్తుండగా సంగీతంలో జి.వి. ప్రకాష్ కుమార్ ఇప్పటికే పనులు మొదలుపెట్టారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. సినిమాకి సంబంధించిన మొదటి లుక్, టీజర్ త్వరలోనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సూర్య – వెంకీ అట్లూరి కాంబినేషన్లో వస్తున్న ఈ కొత్త ప్రయోగం ఏ రేంజ్లో విజయం సాధిస్తుందో చూడాలి. తమిళంతో పాటు తెలుగులోనూ భారీగా రిలీజ్ చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.