Sujeeth : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ఓజీ. సాహో ఫేమ్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్రం గురువారం (అక్టోబర్ 23) నుంచి ఓటీటీలో సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో ఓజీ చిత్రం స్ట్రీమింగ్ కానుంది
ఈ క్రమంలో.. దర్శకుడు సుజీత్ సోషల్ మీడియాలో మంగళవారం పోస్టు చేసిన ఓ నోట్ వైరల్గా మారింది. ‘ఓజీ’ విషయంలో తనను నమ్మి, ఎంతగానో సపోర్ట్ చేశారంటూ నిర్మాత డీవీవీ దానయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఓజీ’ గురించి చాలామంది ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ, సినిమాని ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకూ ఏం అవసరమనేది కొందరు మాత్రమే అర్థం చేసుకుంటారు. నా నిర్మాత, టీమ్ ఇచ్చిన మద్దతు గురించి మాటల్లో చెప్పలేను’’ అని పేర్కొన్నారు. సుజీత్ సడెన్గా ఈ పోస్టు పెట్టడంపై నెట్టింట చర్చ జరుగుతోంది. నిర్మాత దానయ్య, సుజీత్కు నిర్మాణ పరంగా విభేదాలు తలెత్తాయని ఇటీవల రూమర్స్ వచ్చాయి. దానిపైనే ఆయన ఇలా రియాక్ట్ అయి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు.
‘ఓజీ’ చిత్రీకరణ దశలోనే.. నాని హీరోగా సుజీత్ ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ఓజీ’ ప్రొడక్షన్ హౌస్ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపైనే దాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు. కానీ, నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కొన్ని రోజుల క్రితం లాంఛనంగా ప్రారంభమైంది. దీంతో, దానయ్య- సుజీత్ల మధ్య దూరం ఏర్పడిందంటూ వార్తలొచ్చాయి.










