ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాల కోసం ఇతరదేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఎఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డాటా సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు. న్యూఢిల్లీలో కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తో మంత్రి నారా లోకేష్ సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… విశాఖపట్నంలో డాటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తు లో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని చెప్పారు, దీనికి సహకారం కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, భద్రత, గౌరవాన్ని కల్పించేందుకు ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలని, సంబం ధిత ఫిర్యాదుల పరిష్కారం కోసం ఎపిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో జాతీయ, అంతర్జాతీయస్థాయి స్కిల్ కాంక్లేవ్ నిర్వహణలో భాగ స్వామ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలకు నిరంతరం సహ కారం అందించాలన్నారు. వలస కార్మికుల కు ఓవర్సీస్ ట్రైనింగ్, మైగ్రేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫాస్ట్ ట్రాక్ అనుమతులతోపాటు నిధులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు.

ఎపికి చెందిన సుమారు 35లక్షల మంది ప్రవాసాంధ్రులు విదేశాల్లో ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నా రని తెలిపారు. అమెరికాలో 10 లక్షలు, గల్ఫ్ దేశాల్లో 8లక్షలు, ఐరోపా దేశాల్లో 4లక్షలమంది ప్రవాసాంధ్రులు ఉన్నారని పేర్కొన్నారు. యుఎస్ లో అక్కడ ప్రజల తలసరి ఆదాయం $70,000 డాలర్లు కాగా, ప్రవాసాంధ్రుల తల సరి ఆదాయం $1,26,000 డాలర్లుగా ఉంది. ఐరోపాదేశాలు, ఆస్ట్రేలియా, జపాన్, కొరియా, తైవాన్ లతో మొబిలిటీ, మైగ్రేషన్ (MMPA) భాగస్వామ్యాలను ఏర్పాటుచేయడంలో కేంద్రచర్యలు అభినందనీయం అని కొనియా డారు. ప్రపంచ నైపుణ్య రాజధాని గా భారత్ ను తీర్చిదిద్దే ప్రయత్నాల కు ఆంధ్రప్రదేశ్ పూర్తి మద్దతునిస్తిం దని పేర్కొన్నారు. కార్మికుల భద్రత, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతా నికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడం, రాష్ట్ర స్థాయిలో ఆయా ఒప్పందాలను అమలుచేయడంలో ఎపి ముందం జలో ఉంటుందని మంత్రి లోకేష్ అన్నారు