సర్వెంద్రీయానాం నయనం ప్రధానం అంటారు. నిజమే… మన కళ్ళు అందంగా, ఆరోగ్యంగా ఉంటేనే ఈ అందమైన ప్రపంచాన్ని చూడవచ్చు. కొన్నిసార్లు మన అజాగ్రత్త వల్ల మన కళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ మధ్యకాలంలో అనేక ఆధునిక పద్ధతుల ద్వారా కంటి చికిత్సలు చేస్తున్నారు. దూరదృష్టి లోపం సరిచేయడాని కంటికి శస్త్రచికిత్స చేస్తారు.
ఈ మద్య చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికి కంటి చూపు మందగిస్తోంది. ముఖ్యంగా యువత, పిల్లలే ఈ రుగ్మతతో సతమతమవుతున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఈ సమస్య తలెత్తుతోంది. కంప్యూటర్లు, టీవీల ప్రభావంతో రోజురోజుకూ కళ్లద్దాల వినియోగం పెరుగుతోంది. దీనికి తోడు దుమ్ము, ధూళి వంటి కాలుష్యమూ కారణమవుతోంది. శస్త్రచికిత్సను కళ్లద్దాలు లేదా కాంటాక్ట్ లెన్స్ యొక్క వాడకాన్ని పరిమితం చేయడానికి నిర్వహిస్తారు.
సమీపదృష్టి లోపం, దూరదృష్టి లోపం మరియు అసమదృష్టి వంటి సాధారణ స్థాయిలోని వక్రీభవన కంటి లోపాలను సరి చేయడానికి ఉపయోగిస్తారు. లేసిక్లో రెటీనాపై పడే కాంతిని కంటి చూసే విధానాన్ని సరి చేసేందుకు కార్నియా ఆకృతిని మార్చడానికి లేజర్ కిరణాలను ఉపయోగిస్తారు. లేజర్ సర్జరీ రకాన్ని బట్టి కోలుకునే కాలవ్యవధిలో కొన్ని తేడాలుంటాయి. లేసిక్లో కార్నియా పై పొర ఎపీథీలియం, దాని అడుగునున్న పల్చని పొరని కలిపి ఫ్లాప్లా లేపి సర్జరీ చేస్తారు. ఈ పద్ధతిలో ఎపీథీలియం డిస్టర్బ్ కాదు. కాబట్టి కోలుకోవటానికి తక్కువ సమయం పడుతుంది. కంఫర్ట్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. ఉదయం సర్జరీ చేస్తే సాయంత్రానికి చూపు క్లియర్ అవుతుంది. కానీ సర్జరీ తర్వాత చూపు స్పష్టంగా రావటానికి వారం రోజుల సమయం పడుతుంది. మూడు లేక నాలుగు రోజుల వరకూ కొంత ఇబ్బంది ఉంటుంది.
శస్త్రచికిత్సలతో కంటి చూపు మెరగవుతుందా…?
ఇదివరకటి రోజుల్లో శుక్లం ముదిరినపప్పుడే ఆపరేషన్ ద్వారా శుక్లాన్ని బయటికి తీసేవారు. కానీ.. ఇప్పుడు అదంతా అవసరం లేదు. ఖఫేకో ఎమల్సిఫికేషన్ అనే విధానంలో కనుగుడ్డు పై పొర మీద చిన్న రంధ్రం చేసి దాని గుండా సూదిలాంటి పరికరాన్ని లోనిక పంపి శుక్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ సన్నని రంధ్రం నుంచే వాటిని బయటికి తీస్తారు. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరుణంలో శుక్లం బాగా ముదరకముందే.. చూపు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తున్నప్పుడే ఆపరేషన్ చేయించుకోవటం ఉత్తమం.
ముందుకాలంలో సర్జరీ చేసేటప్పుడు ఇంజక్షన్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు వాటి అవసరం లేకుండా కేవలం కంట్లో చుక్కల మత్తు మందు వేసి ఆపరేషన్ పూర్తి చేసే వెసలుబాటు ఉంది. దీన్ని టాపికల్ అనస్థీషియా అంటారు. మరీ పెద్ద వసు వారైతే.. నొప్పి అస్సలు తెలియకుండా ఉండాలంటే కంటి చుట్టూరా చిన్న చిన్న ఇంజెక్షన్లు ఇస్తారు. దీన్ని ఖపెరి బల్బార్ అనస్థీషియా అంటారు. అరుదుగా వచ్చే నొప్పి కూడా భరించలేకపోతుంటే.. కనుగుడ్డు లోపలికి ఇంజక్షన్ ఇస్తారు. దీన్ని ఇంట్రా కేమరల్ మత్తు అంటారు.
శస్త్రచికిత్స వల్ల కలిగే ఇతర సమస్యలు ఏంటి…..?
శస్త్రచికిత్స చేయించుకోవడానికి ముందు కళ్లు పొడిబారే సమస్య ఉందో, లేదో తనిఖీ చేయించుకోవాలి. శస్త్రచికిత్స చేయడానికి ముందు కళ్లు పొడిబారే సమస్యకు సరైన రీతిలో చికిత్స పొందాలి. శస్త్రచికిత్స వలన తాత్కాలికంగా కంటి నీరు ఉత్పత్తి మందగిస్తుంది. ఈ కారణంగా కళ్లు పొడే బారే సమస్య మరింత తీవ్రంగా మారుతుంది. శస్త్రచికిత్స వలన కూడా కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఇన్ఫెక్షన్ సోకవచ్చు. అరుదైన సందర్భాల్లో వ్యక్తులకు సరైన చూపు మందగిస్తుంది.
శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత ద్వంద్వ దృష్టి లేదా చుట్టూ వెలుగు కనిపించడం, ప్రకాశవంతమైన కాంతి చుట్టూ మసక మరియు రాత్రి సమయాల్లో చూడటంలో సమస్యలు వంటి సమస్యలు సంభవించవచ్చు. శస్త్రచికిత్స వలన సంభవించే ఇన్ఫెక్షన్ మరియు వాపులను మందులతో నయం చేయవచ్చు. చాలావరకు ఇతర ప్రభావాలు కొన్ని రోజుల్లో తగ్గిపోతాయి. కొంతమంది వ్యక్తుల్లో మాత్రమే అవి శాశ్వతంగా ఉండిపోతాయి. కొన్నిసార్లు, చూపులో కోరుకునే స్పష్టత కోసం మరొక శస్త్రచికిత్సను నిర్వహించాల్సి రావచ్చు.