రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ 2025 సంవత్సరానికి సంబంధించి ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు నోటిఫికేషన్ (CEN: 08/2025) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ పబ్లిసిటీ న్స్పెక్టర్, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ తదితర 312 పోస్టులు భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు జనవరి 29వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్మీడియట్, లా డిగ్రీ, సంబంధిత విభాగాల్లో డిప్లొమా, పీజీ డిప్లొమా, ఎంబీఏ, మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 1, 2026 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో జనవరి 29, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనలర్ అభ్యర్ధులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్, ఈబీసీ, మైనారిటీ అభ్యర్ధులు రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఆన్లైన్ రాత పరీక్ష, ట్రాన్స్లేషన్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.19,000, జూనియర్ ట్రాన్స్లేటర్, ఇన్స్పెక్టర్స్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు రూ.35,400, ఇతర పోస్టులకు రూ.44,900 చొప్పున జీతంగా చెల్లిస్తారు.
పోస్టు వివరాలు: ఖాళీలు
మొత్తం ఖాళీల సంఖ్య: 312
- చీఫ్ లా అసిస్టెంట్: 22
- పబ్లిక్ ప్రాసిక్యూటర్: 07
- జూనియర్ ట్రాన్స్లేటర్: 202
- సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్: 15
- స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్: 24
- సైంటిఫిక్ అసిస్టెంట్/ ట్రైనింగ్: 02
- ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-3: 39
- సైంటిఫిక్ సూపర్వైజర్/ఎర్గోనామిక్స్ అండ్ ట్రైనింగ్: 01
ఆర్ఆర్బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్పూర్, కోల్కతా, ముంబయి, పట్నా, ప్రయాగ్రాజ్.
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్ లేదా తత్సమానం, లా డిగ్రీ, సంబంధిత విభాగాల్లో డిప్లొమా, పీజీ డిప్లొమా, ఎంబీఏ, మాస్టర్స్ డిగ్రీ, ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.01.2026 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 30.12.2025.
దరఖాస్తు చివరి తేదీ: 29.01.2026.
దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 31.01.2026.
దరఖాస్తు సవరణ తేదీలు: 01.02.2026 నుంచి 10.02.2026.










