పసిడి ప్రియులకు ఈరోజు షాకింగ్ న్యూస్ వచ్చింది. ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. అలానే వెండి ధర కూడా పెరిగింది. ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉందో చూద్దాం…
దేశీయ విపణిలో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. క్రితం రోజుతో పోలిస్తే.. కిలో వెండి ధర శనివారం రూ.20వేల మేర ఎగబాకింది. హైదరాబాద్ మార్కెట్లో శనివారం 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.1,61,150 పలికింది. ముందురోజు ధరతో పోలిస్తే రూ.3,150 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,550గా ఉంది. శుక్రవారం కిలో వెండి రూ.2,60,000 పలకగా.. నేడు రూ.2,80,000కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ లోహాల ధరలు కూడా పెరిగాయి. ఔన్సు పసిడి (Gold) ధర 4,965 డాలర్లు, ఔన్సు వెండి (Silver) ధర 77.08 డాలర్లుగా కొనసాగుతోంది.









