SS Rajamouli – Mahesh Babu – సూపర్ స్టార్ మహేశ్ బాబు తన పాస్పోర్ట్ తనకు వచ్చేసిందంటూ ఎయిర్పోర్ట్లో ఫొటోగ్రాఫర్లకు సరదాగా చూపించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్కి వెళ్లాడు. రాజమౌళి మహేశ్ పాస్పోర్ట్ని తిరిగిఇవ్వడంతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దర్శనమిచ్చాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), డైరెక్టర్ రాజమౌళి(SS Rajamouli) కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎమ్బి-29(SSMB-29) వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఓ వైపు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంటే వారానికి ఓసారి విదేశీ పర్యటనకు వెళుతున్న మహేష్ బాబును సింహాన్ని బోనులో బంధించినట్టు బందించి మహేష్ పాస్పోర్టును లాక్కున్నట్టు రాజమౌళి ఫొటోకు పొజు ఇచ్చారు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
ఇండస్ట్రీలో ఎక్కువగా విహారయాత్రలకు వెళ్లే హీరో ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు మహేశ్ బాబు. ఇప్పుడీ హీరో రాజమౌళి సినిమాతో #SSMB29 బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ దర్శకధీరుడు మూడు నెలల క్రితం మహేశ్ పాస్పోర్ట్ తీసుకున్నానంటూ ఓ పోస్ట్ పెట్టారు. ఆ రోజు సోషల్ మీడియా అంతా ఫన్నీ మీమ్స్తో నిండిపోయింది. ఇప్పుడు మహేశ్ తన పాస్పోర్ట్ను చూపుతూ ఓ వీడియోలో కనిపించారు. దీంతో మరోసారి మీమర్స్కు పని పడింది. ‘మై పాస్పోర్ట్ ఈజ్ బ్యాక్’, ‘పాస్పోర్ట్ వచ్చేసింది.. నన్ను ఎవరూ ఆపలేరు’ అంటూ నెట్టింట మహేశ్ వెర్షన్ మీమ్స్ సందడి చేస్తున్నాయి. #SSMB29 హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది.