ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో అరకు కాఫీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణం రాజు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ గారు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు, గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ గారు, పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణం రాజు గారు రిబ్బన్ కట్ చేసి అరకు కాఫీ స్టాల్ను ప్రారంభించారు.అరకు ప్రాంతం నుంచి సేంద్రీయ విధానంలో ఉత్పత్తి చేసిన ఈ కాఫీ ప్రత్యేకమైన రుచిని కలిగి ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, ఇలాంటి ఉత్పత్తులను ప్రభుత్వ పరంగా మరింత ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి, డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణం రాజు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ గారికి అరకు కాఫీని స్వయంగా అందజేశారు.