ఆర్మీ విభాగంలో అగ్నివీర్ సిబ్బంది నియామకానికి 2025–26కు నమోదు ప్రక్రియ చేపట్టినట్టు గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ డైరెక్టర్ కల్నల్ పునీత్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీఈఈ)ను మొదటిసారి తెలుగుతో సహా 13 భాషల్లో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
గుంటూరు, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్, ప్రకారం, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన ఆసక్తిగల అభ్యర్థులతో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ కార్యాలయ సహాయకులు/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ వృత్తి నిపుణుల పోస్టులను భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. అభ్యర్థులు ఏప్రిల్ 10లోగా www.joinindianarmy. nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
దరఖాస్తు ప్రారంభ తేదీ:మార్చి 12, 2025
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 10, 20255
పరీక్ష తేదీ: జూన్ 2025 (ఇంకా ఖరారు కాలేదు)
భారత సైన్యంలో అగ్నివీర్ ఉద్యోగాలకు ఆన్ లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి ఏ. సోమేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలుపారు. భారత సైన్యంలో అగ్నివీర్ ఉద్యోగాలకు అవివాహిత పురుష అభ్యర్థుల నుండి ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ఈనెల 12వ తేదీ నుండి ఏప్రిల్ 10 వరకు www.joinindianarmy.nic.in వెబ్ సైట్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్ధులు వారి అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఆర్మీ ర్యాలీ తేదీ, సమయం పొందగలరని అన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా యువత ఆన్ లైన్ పరీక్ష పాసైన వారికి ఆర్మీ ర్యాలీ (ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్) నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎంపిక అయిన అభ్యర్థులకు నాలుగు సంవత్సరాల షార్ట్ టర్మ్ సర్వీస్ ద్వారా అగ్నివీర్ ఉద్యోగానికి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఆర్మీ ఆధ్వర్యంలో జరుగుతుందని, అభ్యర్డులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని కోరారు. ఆసక్తి గల అభ్యర్డులు ఇండియన్ ఆర్మీలో చేరుటకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు కార్యాలయపు పని వేళలో సెట్విజ్ మేనేజర్ కె. వెంకటరమణ, ఫోన్ నెంబర్ 9849913080 కు సంప్రదించవచ్చని అన్నారు.