భారత క్రికేటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (Dhanashree Verma) విడాకుల సంభందిచిన కీలక వార్త ఒకటి బయటికొచ్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ , ధనశ్రీ వర్మ (Dhanashree Verma) విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ విడాకులు అన్నప్పటి నుంచి సోషల్ మీడియా ఫోకస్ ఈ జంట మీదే ఉంది. నెట్టింట వీళ్లు ఏ పోస్ట్ పెట్టినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది. మొన్నామధ్య ధనశ్రీకి భరణం కింద చాహల్ రూ.60 కోట్లు ఇస్తున్నాడనే వార్త తెగ వైరల్ అయిపోయింది. కానీ ఆ వార్తలో ఎలాంటి నిజం లేదు. తాజాగా మరోసారి వీరి భరణం వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదే అంశంపై తాజాగా కీలక సమాచారం ఒకటి బయటికొచ్చింది. చాహల్, ధన శ్రీ విడాకుల కోసం బాంబే హై కోర్టులో పిటిషన్ వేశారు. అయితే, 6 నెలల కూలింగ్ పీరియడ్ను బాంబే హైకోర్టు మినహాయించింది. ఈ విడాకుల పిటిషన్పై మార్చి 20లోగా నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును బాంబే హైకోర్టు ఆదేశించింది. ధన శ్రీకి భరణం కింద రూ.4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ అంగీకరించినట్లు సమాచారం. అయితే, ఆ మొత్తంలో చాహల్ ఇప్పటివరకు 2.37 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. కూలింగ్ పీరియడ్ పిటిషన్ను తోసిపుచ్చినందున భరణం కింద చెల్లించాల్సిన మిగతా మొత్తాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవడం లేదని పేర్కొంది.