Pawan kalyan – Allu Arjun: పవన్‌ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్‌

By manavaradhi.com

Published on:

Follow Us
Pawan- Allu Arjun

ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్‌ సోమవారం హైదరాబాద్‌లో కలిశారు. సింగపూర్‌లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్‌ కుమారుడు మార్క్‌ శంకర్‌ గాయపడిన సంగతి తెలిసిందే.

గత కొద్ది నెలలుగా తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో జరుగుతున్న చ‌ర్చ‌నీయాంశాల‌లో మెగా వ‌ర్సెస్ అల్లు ఫ్యామిలీల గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చెక్కరలు కోడుతూనే ఉన్నాయి. గతేడాది జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తూ నంద్యాల వెళ్లి మరీ ప్ర‌చారం చేశారు. ఆ స‌మ‌యంలో మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్ వైపు అంటే ..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. అయితే అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఘోరంగా ఓడిపోవ‌డంతో మెగా అభిమానులు అల్లు అర్జున్‌ని ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు.

ఏపి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను హీరో అల్లు అర్జున్ కలిశారు. ఇటీవల పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాదం నుంచి మార్క్ శంకర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డాడు. విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ హుటాహుటిన సింగపూర్ వెళ్లారు. పవన్ తో పాటు చిరంజీవి దంపతులు కూడా సింగపూర్ వెళ్లారు. ప్రమాదం కారణంగా మార్క్ శంకర్ కాళ్లకు , చేతులకు గాయాలయ్యాయి. పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో కాస్త ఇబ్బందిపడ్డాడు. ఇక ఇప్పుడు పవన్ భార్యను, కొడుకుని ఇండియాకు తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో పవన్‌తో పాటు కుటుంబ సభ్యులను కలిసిన అల్లు అర్జున్‌.. బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

Leave a Comment